రాజీవ్‌ హంతకులకు సుప్రీంలో చుక్కెదురు

3
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 2 (జనంసాక్షి):

మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హంతకుల విడుదలపై సుప్రీంకోర్టు  బుధవారం  స్టే విధించింది.  కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే వారి విడుదలపై  నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ వారిని విడుదల చేయరాదని న్యాయస్థానం ఆదేశించింది. రాజీవ్‌ హంతకుల విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సంయమనం పాటించాలని  కోరింది. తమకు విధించిన శిక్షను మాఫీ చేయాలంటూ వాళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజీవ్‌గాంధీ హంతకుల మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పు  వెలువరించినా ఈ వివాదం నడుస్తోంది. గతంలో వారిని విడుదల చేయడానికి తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నపుడు యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజీవ్‌ గాంధీ హత్య అనేది భారతదేశం విూద జరిగిన దాడి అని, ఆ హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయొద్దని కోరింది. ఆ సందర్భంగా కూడా  సుప్రీం ఇదేలా స్పందిస్తూ దోషుల విడుదలపై స్టే విధించింది. మరోవైపు రాజీవ్‌ హత్యకేసులో దోషులు నళిని, మురుగన్ల కుమార్తె హరిత్ర రాహుల్‌ గాంధీని క్షమాపణ కోరింది. చేసిన నేరానికి తన తల్లిదండ్రులు శిక్ష అనుభవించటంతో పాటు, పశ్చాత్తాపం చెందారని, వారిని క్షమించి వదిలేయాలని విజ్ఞప్తి  చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరికి క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్నయించడంతో, శిక్ష పడ్డ 9మంది రాజీవ్‌ గాంధీ హంతకులను క్షమాభిక్ష పెట్టాలన్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. జీవితఖైదు అనుభవించాల్సిందేనని సుప్రీం తేల్చిచెప్పింది.. కేంద్రసంస్థల దర్యాప్తు చేసిన ఏ కేసులోనైనా నిందితులపై నిర్ణయం తీసుకునేముందు కేంద్రం నిర్ణయం తప్పనిసరి అంటూ తేల్చేసింది..కేంద్రం నిర్ణయం లేకుండా రాష్ట్రప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేసింది..దీంతో రాజీవ్‌ హంతకులు జీవితఖైదు అనుభవించాల్సి ఉంటుంది.