రాజ్యసభలోనూ విజయం : ప్రధాని

ఢిల్లీ : ఎఫ్‌డీఐల విషయంలో రాజ్యసభలో కూడా ఆమోదం లభిస్తుందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు. గురువారం పార్లమెంటు భవనం బయట మీడియాతో మాట్లాడుతూ ఆయన మంత్రివర్గ సహచరులు పలువురు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లోక్‌సభలో తాము విజయం సాధించామని, రాజ్యసభలో కూడా అంకెలు తమకు అనుకూలంగా వస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ చెప్పారు.