రాజ్యసభ మధ్యాహ్నాం 2 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ: రాజ్యసభలో సమాజ్‌వాది పార్టీ ఆందోళన చేపట్టింది. ఉగ్రవాద ఆరోపణలు అంటగట్టి అక్రమంగా అరెస్టు చేసిన అమాయక ముస్లిం యువతను విడుదల చేయాలన సభ్యులు డిమాండ్‌ వ్యక్తం చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్పం 2 గంటలకు వాయిదా వేశారు.