రాజ్యసభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలపై సమావేశమైన రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఎఫ్‌డీఐ, ఫెమాలపై ఒకే సారి చర్చ జరపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వామపక్షాలు, బీజేపీ వ్యతిరేకించాయి. ఫెమాపై ప్రత్యేక చర్చకు పట్టుబట్టడంతో ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ సభను రేపటికి వాయిదా వేశారు.