రామగుండం వద్ద గూడ్స్‌ రెళ్లో మంటలు

కరీంనగర్‌: బొగ్గు లోడ్‌తో వెళ్తోన్న గూడ్స్‌ రైళ్లో మంటలు చెలరేగాయి. బొగ్గు లోడ్‌తో వెళ్తోన్న గూడ్స్‌ రైలు రామంగుండం వద్ద అగ్నిప్రమాదానికి గురైంది. ప్రమాదాన్ని గుర్తించిన గూడ్స్‌ రైలు డ్రైవర్‌ రైలును వెంటనే నిలిపివేశారు. అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు విచారణలో తేలాల్సి ఉంది.