రాయలసీమకు భారీ వర్షసూచన

తిరుమలలో ఎడతెరిపి లేకుండా వాన

తిరుపతి,నవంబర్‌21(జ‌నంసాక్షి): నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో పాటు అల్పపీడన ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. బుధవారం తెల్లవారు జాము నుంచి తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండగా.. భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల రద్దీ కూడా సాధారణంగా ఉంది. మరో వైపు

చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌ పురం మండలంలో ఈ రోజు ఉదయం నుంచి చిరుజల్లులతో వర్షం కురుస్తోంది.