రాష్ట్రకార్యాదర్శి నారాయణ భూపోరాటం:అరెస్టు

హైదరాబాద్‌:ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న ఆరో విడత భూ పంపిణీ విదానాన్ని నిరసిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి భూపోరాటానికి దిగారు.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం దండుమైలారంలోని 101,102,103సర్వే నెంబర్లలో భూపొరాటం చేపట్టారు.దండుమైలారంలోని 31 ఎకరాల భూమిలోకి మద్యాహ్నం స్థానిక నేతలతో కలిసి వెళ్లిన నారాయణ అక్కడ సీపీఐ జెండాలను పాతారు.ప్రభుత్వం చేపడుతున్న భూ పంపణీ విదానం బూటకమని ఆయన విమర్శించారు.స్వయంగా ట్రాక్టరు నడుపుతూ దుక్కి దున్నారు.అనంతరం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల్లో చొరబడిన నారాయణను పోలీసులు ఆరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పొలీస్‌స్టేషన్‌కు తరలించారు.