రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి

5

– ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ,డిసెంబర్‌4(జనంసాక్షి): దేశాభివృద్ధిలో రాష్ట్రాలూ కీలకభూమిక పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఢిల్లీ నుంచే అభివృద్ధి సాధ్యం కాదని రాష్ట్రాలూ తమవంతు పాత్ర పోషించాలని అన్నారు. నిధులను ఎక్కడ ఖర్చు చేయాలో ఇప్పటివరకు ఢిల్లీలోనే నిర్ణయించేవారని, తాము ఈ పరిస్థితిని మార్చామని చెప్పారు. నీతి ఆయోగ్‌ లక్ష్యం కూడా ఇదేనన్నారు. శుక్రవారం హిందూస్థాన్‌ టైమ్స లీడర్‌ షిమ్‌ సమిట్‌ లో ఆయన ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్నప్పుడు మనదేశం అభివృద్ధి ఆగలేదని తెలిపారు. సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యమన్నారు. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని అన్నారు. దేశంలో ఇప్పటికి 18 వేల గ్రామాలకు కరెంట్‌ లేదని తెలిపారు. గత ప్రభుత్వాలు పనిచేయలేదని తాను చెప్పడం లేదని, వేయి రోజుల్లో గ్రామాలన్నింటికీ కరెంట్‌ అందిస్తామని హావిూయిచ్చారు. పార్లమెంట్‌ సమావేశాలు ఇప్పుడు సజావుగా నడుస్తున్నాయని.. ఈ ఘనత తానొక్కడితే కాదని అన్ని పార్టీలకు చెందుతుందని నరేంద్ర మోదీ అన్నారు. ఇదే దశలో  భారత్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ అన్నారు. స్థిర ప్రభుత్వం ఏర్పడడం వల్ల మంచి జరిగిందన్నారు. దివ్యమైన భవిష్యత్తు దిశగా భారత్‌ అడుగులు వేస్తోందని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశంలో నిలిచిపోయిన 65 పథకాలు తిరిగి ప్రారంభం అయ్యాయన్నారు. రాజధాని ఢిల్లీ నుంచే మొత్తం పాలన సాగిస్తే …దేశ ప్రగతి వీలుకాదన్నారు. సాంప్రదాయంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాలన్నీ బలవంతంగా తయారవుతున్నాయని మోదీ అన్నారు. 8.5 శాతం చొప్పున్న విద్యుత్తు ఉత్పత్తి క్రమంగా పెరుగుతోందన్నారు.