రాష్ట్రాల హక్కులను సాధించే క్రమంలోనే.. కేటీఆర్తో జగన్ భేటీఅయ్యారు
– పొత్తు అంటూ చంద్రబాబు దుష్పచ్రారం ప్రారంభించాడు
– హరికృష్ణ అంత్యక్రియలకువెళ్లి పొత్తుపై చర్చించిన చరిత్ర బాబుది
– వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి, జనవరి18(జనంసాక్షి) : రాష్ట్రాల హక్కులను సాధించే క్రమంలో కేటీఆర్, జగన్ మధ్య భేటీ జరిగిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఈ సందర్భంగా చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్, జగన్ల భేటీపై వక్రభాష్యాలు చెబుతూ.. టీఆర్ఎస్, వైసీపీ పొత్తు పెట్టుకుంటున్నాయని చంద్రబాబు దుష్పచ్రారం ప్రారంభించారని విమర్శలు గుప్పించారు. బాబు నలభయ్యేళ్ల రాజకీయ చరిత్ర అవినీతి మయం, దుర్గంధ భరితం, భరింపశక్యం కానటువంటిదని ఎద్దేవా చేశారు. నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కేటీఆర్తో రాజకీయ పొత్తుల గురించి మాట్లాడింది విూరుకాదా అని సూటిగా ప్రశ్నించారు. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి కేసీఆర్ వస్తే ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేసి దగ్గరుండి సపర్యలు చేస్తారు.. విూమంత్రివర్గ సహచరురాలు పరిటాల సునీత ఇంట్లో వివాహానికి ఆహ్వానిస్తారు.. కేసీఆర్ తలపెట్టిన చంఢీయాగంలో పాల్గొంటారు… మేం కేటీఆర్తో భేటీ అయితే బురద జల్లుతారా అంటూ అనిధ్వజమెత్తారు. టీడీపీ ఏపార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేసిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అనేక రుగ్మతలతో భాదపడుతున్నారని, కొత్తగా ఆయనకు మానసిక రుగ్మత కూడా వచ్చినట్లుందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వింటేనే వణికిపోతూ.. బాబుకు నిద్ర కూడా పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలు కాపాడటం కోసమే వైసీపీ పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా సాధించే విషయంలో మొదటినుంచి పోరాటం చేస్తున్నది వైసీపీ పార్టీయేనని ఉద్ఘాటించారు.