రాహుల్తో ఓవైసీ మిలాఖత్: జివిఎల్
విజయవాడ,నవంబర్20(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీలు భాయ్..భాయ్ అనుకున్నారని, ఒవైసీ ఎన్నికల ఎంటర్ టైనర్ గా మారారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. మంగళవారం నాడాయన విూడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఒవైసీ ప్రచారానికి వెళ్లకుండా ఉంటే రూ.25 లక్షలు ఇస్తానంటూ కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిన దాని విషయమై ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మహాకూటమి ఎన్నికల ప్రచారం నిమిత్తం సీఎం చంద్రబాబు రూ.500 కోట్లు పంపిస్తున్నారని, ఆ డబ్బులో
నుంచి ఒవైసీకి రూ.25 లక్షలు ఇస్తామని చెప్పి ఉంటారని ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పరిపాలనపై జీవీఎల్ విమర్శలు గుప్పించారు. ప్రజలు కేంద్రంగా కాకుండా, కుటుంబసభ్యులు కేంద్రంగా పరిపాలనలు సాగుతున్నాయని విమర్శించారు. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి సుహాసికి టికెట్ లభించడంపై ఆయన విమర్శలు చేశారు.