రికార్డు స్థాయిలో లడ్డూ వేలం పాట.

రికార్డు స్థాయిలో లడ్డూ వేలం పాట.

1,00999 రూపాయలకు దక్కించుకున్న వంగూరి యాదయ్య
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్27(జనంసాక్షి):-
 యాచారం మండలం నందివనపర్తి    గ్రామంలో శ్రీకృష్ణ యాదవ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడు నవరాత్రి ఉత్సవాలు ముగింపు ఘనంగా జరిగాయి.ఇందులో భాగంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గ్రామానికి చెందిన వంగూరు యాదయ్య యాదవ్ లడ్డు వేలం పాటలో రూ.1,00,999 రూపాయలకు దక్కించుకున్నారు.అలాగే చిన్న లడ్డును రూ.51,166/- రూపాయలకు జెనిగే మలయ్య కైవసం చేసుకున్నారు.ఈ వేలం పాటలో శ్రీకృష్ణ యాదవ్ యూత్ సభ్యులు, గ్రామస్తులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…