రిపోర్టర్ పై దాడి ఖండిస్తూ నల్ల బ్యాడ్జిలతో అంబేద్కర్ విగ్రహం వద్ద నిసన వ్యక్తం చేస్తున్న రిపోర్టర్స్

గంగారం అక్టోబర్ 11 (జనం సాక్షి)
గంగారం మండలం చింతగూడెం గ్రామ పరిధిలో మంగళవారం రోజున ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్ మన తెలంగాణ రిపోర్టర్ అయిన పల్లె సురేష్ పై చేసిన దాడిని ఖండిస్తూ గంగారం, కొత్తగూడ మండలాల రిపోర్టర్స్ నల్ల బ్యాడ్జీలతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ దాడి పైన సంబంధిత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ను వివరణ అడగగా బీట్ ఆఫీసర్ను విసిగించగా కోపంతో కొట్టాడని సమాధానం చెప్పడం ఎంతవరకు న్యాయం ఇది ప్రజాస్వామ్యమా లేక అప్రజాస్వామ్యమా అంబేద్కర్ మనకు ఇచ్చిన రాజ్యాంగం ఇదేనా కొట్టే అధికారం ఒక బీట్ ఆఫీసర్ ఎక్కడిది దీని సభ్య లోకం తలదించుకోవాల్సిన విషయంగా పరిగణించాలని సంబంధిత బీట్ ఆఫీసర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పత్రిక విలేకరులు తమ నిరసనను వ్యక్తం చేశారు