రూ.29కే కిలో సన్న బియ్యం పథకం ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రూ.29లకే కిలో సన్నబియ్యం పథకాన్ని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి శ్రీధర్‌బాబు ఈరోజు కొత్తపేట రైతు బజారులో ప్రారంభించారు. మార్కెట్‌లో మొదటిరకం బియ్యం 35రూపాయలు ఉండగా ప్రభుత్వం 29కే అందిస్తోందని ఈ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగపర్చుకోవాలని కోరారు. ప్రతి జిల్లాలో ఈ పథకాన్ని జాయింట్‌ కలెక్టర్‌ పర్యవేక్షిస్తారని, అధికారులు నాణ్యమైన బియ్యం అందజేయాలని మంత్రి ఆదేశించారు.