రెవెన్యూ సదస్సులను ప్రారంభించిన సీఎం

మహబూబ్‌నగర్‌ : రెవెన్యూ సదస్సును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ధన్వాడ మండలం మండపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, మంత్రులు రఘు వీరారెడ్డి, డీకే అరుణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.