రేపు కంబోడియాలో పర్యటించనున్న ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ రేపు కంబోడియాలో పర్యటించనున్నారు. ఏషియన్‌, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వాణిజ్య, వ్యాపార సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు వివిధ దేశాల  నేతలతో చర్చించనున్నారు.