రేపు వరంగల్కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
వరంగల్ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు రేపు నగరానికి రానున్నారు. ఆదివారం హృదయ్ పథకాన్ని వెంకయ్యనాయుడు లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో హృదయ్ పైలాన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఉదయం 9 గంటలకు కేంద్ర మంత్రి చారిత్రక ఖిలా వరంగల్ కోటకు వస్తారు. అక్కడ కాకతీయుల కట్టడాలను శిల్పసంపదను చూసిన అనంతరం భద్రకాళి షోర్బండ్ను పరిశీలిస్తారు. హృద య్ పథకంలో భద్రకాళి షోర్బండ్ డీపీఆర్కు కేంద్రం రూ.15 కోట్లు మంజూరు చేసింది. భద్రకాళి షోర్బండ్, పద్మాక్షి గుట్టను అనుసంధానం చేసుకుంటూ మొదటి విడత హృదయ్ పథకంలో అభివృద్ధి చేయనున్నారు.