రైతులకు అండగా కార్యక్రమాలు 

అనంతపురం,మార్చి18(ఆర్‌ఎన్‌ఎ): వచ్చే ఖరీఫ్‌కు లక్ష క్వింటాళ్లు వేరుసెనగ సేకరించాలన్నదే ప్రధాన
లక్ష్యంగా వ్వయసాయశాఖ ప్రణాళిక సిద్దం చేస్తోంది.  రానున్న ఖరీఫ్‌లో నవధాన్యాలు, సూక్ష్మపోషకాలు, యంత్రాలు రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. వ్యవసాయాధికారులు, మన విత్తన కేంద్రాల ప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే లక్ష్యాన్ని సాధించవచ్చని వ్యవసాయ అధికారులు సూచించారు.
ముందస్తుగా వేరుసెనగ విత్తనకాయలను సేకరించి, నాణ్యమైన విత్తు రైతులకు అందించడమే మన విత్తన కేంద్రాల ప్రధాన ఉద్దేశమన్నారు. హెక్టారుకు 20 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఏయే రైతు ఎన్ని హెక్టార్లలో వేరుసెనగ సాగు చేశారన్న వివరాలను సేకరించాలన్నారు. పంటకోత పూర్తి కాగానే కాయలను సేకరించాలని సూచించారు. ఒక్క బస్తాకు కూడా బయట మార్కెట్‌కు వెళ్లకూడదన్నారు. ఇదిలావుంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందించి అండగా నిలవాలని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం అధికారి సూచించారు.ప్రధానంగా నేలను, భూగర్భ జలాలను కాపాడుకుంటే అదే రైతులకు కొండంత బలమన్నారు. ప్రతి రైతులు భూసార పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏయే నేలలకు ఏయే ఏయే పంటలు వేసుకోవాలి. భూసార ఫలితాల ఆధారంగా ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాన్నది రైతులకు తెలియజేయాలన్నారు.