రైతు బీమా రైతులకు కొండంత ధీమా

– ఎమ్మెల్యే కే మహేష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బి మనోహర్ రెడ్డి
కుల్కచర్ల, నవంబర్ 10 (జనం సాక్షి):
రైతు బీమా రైతులకు కొండంత ధీమా అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.గురువారం కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన బండని లక్ష్మమ్మ అనే రైతు ఇటీవల మృతి చెందారు.రైతు బీమా పథకం ద్వారా మంజూరైన 5 లక్షల రూపాయలు చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ..వ్యవసాయం నమ్ముకున్న రైతు మరణిస్తే కుటుంబం ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా సీఎం కేసీఆర్ రైతు బీమా పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.గుంట భూమి ఉన్న రైతు మరణిస్తే రైతు బీమా వర్తిస్తుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బృంగి హరికృష్ణ, రైతుబంధు మండల అధ్యక్షులు రాజు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ నాగరాజు యాదవ్, టిఆర్ఎస్ నాయకులు రాజప్ప, సారా శ్రీనివాస్, కనకం మొగులయ్య, మాలే కృష్ణయ్య, కాంగారి ఆంజనేయులు, శ్రీశైలం, వెంకట్ రాములు, చంద్రయ్య, బాబు, రాములు, రాంచందర్, నర్సింలు, జానీ, ఎల్లయ్య, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.