రైలు కింద పడి యువకుడు మృతి
చిత్తూరు, జనవరి18(జనంసాక్షి) : రైలు ఆగకముందే కిందికి దిగడానికి ప్రయత్నించి కాలు జారి పడి యువకుడు మృతి చెందిన ఘటన నగరి రైల్వేస్టేషన్ సవిూపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో చెన్నై నుండి తిరుపతికి వెళ్ళే యూనిట్ ఫాస్ట్ రైలు నగరి రైల్వే స్టేషన్లో ఆగకముందే, ఓ యువకుడు రైలు నుండి కిందికి దిగేందుకు ప్రయత్నించి కాలుజారి రైలు కిందపడి మృతి చెందాడు. వెంటనే నగరి రైల్వే స్టేషన్ సిబ్బంది, రేణిగుంట రైల్వే జోన్ అధికారులకు సమాచారం తెలిపారు. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. మృతి చెందిన యువకుని వివరాలు తెలియాల్సి ఉంది.