రైలు ఢీకొని ఇద్దరు ప్రయాణికుల మృతి

లక్నో,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): యుపిలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్‌ దాటుతున్న సమయంలో ఓ రైలు ఏడుగురిని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఆస్పత్రికి తరలించారు. కోశి కొలన్‌ రైల్వే స్టేషన్‌ సవిూపంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు ఎక్కుదామని ఒక ట్రాక్‌ నుంచి మరో ట్రాక్‌ దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని అక్కడ ఉన్న రైలు ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.

—-