రోడ్డు ఇరువైపుల మొక్కలు నాటిన సర్పంచ్

టేకులపల్లి ,ఆగస్టు 21( జనం సాక్షి) :స్వాతంత్ర భారత వజ్రొత్సవాలలో భాగంగా ముత్యాలంపాడు క్రాస్ రోడ్ గ్రామ పంచయతీ లో రోడ్డుకిరువైపులా సర్పంచ్ మాలోతు సురేందర్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం హరితహారం మొక్కలు నాటారు.ఈ కార్యక్రమం లో వైస్ ఎంపీపీ ఉందేటి ప్రసాద్, పంచాయతికార్యదర్శి శ్వేత, ఏపీవో శ్రీనివాస్, వార్డ్ సభ్యులు, యూత్ ,గ్రామస్తులు పంచాయతి కార్మికులు పాల్గొన్నారు.