రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని మన్యంకొండ, షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. జిల్లాలోని మన్యంకొండ వద్ద కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు కుటుంబసభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో చోట షాద్‌నగర్‌ సమీపంలో రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద లారీని క్వాలీస్‌ ఢీకొంది. ఈప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.