రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఖమ్మం: జిల్లాలోని బూర్గంపాడు మండలం ముసలిమడుగు వద్ద ఈ ఉదయం ఓ వాహనం కల్వర్టును ఢీకొటింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.