రోడ్లపై వడ్ల కుప్పలు తొలగించాలి

– రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి
చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 16 : రోడ్ల మీద వడ్ల కుప్పలు తొలగించాలని రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం చేర్యాల మండలంలోని కమలాయపల్లి, అర్జున్ పట్ల గ్రామాలలో రోడ్డుపై నిర్లక్ష్యంగా ఉన్న వడ్ల కుప్పలను వారు పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు రోడ్డుపై వడ్ల కుప్పలు ఆరబోయడంతో ప్రయాణికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రజలకు అంతరాయం జరగకుండా ప్రత్యేక కల్లాలు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.