లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమం

కేసముద్రం సెప్టెంబర్ 5 జనం సాక్షి /సోమవారం గురుపూజోత్సవమును పురస్కరించుకొని కేసముద్రం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్ సెక్రటరీ లక్కాకుల సత్యనారాయణ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సన్మాన కార్యక్రమంలో చీకటి వెంకటరామ నరసయ్య , హరినాథ్, ముప్పా ఏకాంతం, పరంకుశం పద్మలత,జ్యోతి ,నాగమణి ,కృష్ణవేణి ,బిక్షపతి, యాకాంబరం ,నల్ల కిరణ్, చందా గోపి తదితర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రశేఖర్ , పాస్ట్ జెర్సీ చందా గోపి ,ఫాస్ట్ ప్రెసిడెంట్ బోగోజు నాగేశ్వర చారి ,ఫాస్ట్ కోశాధికారి చింత కర్ణాకర్, వైస్ ఎంపీపీ రావుల నవీన్ రెడ్డి ,మారం సమ్మిరెడ్డి , బెజ్జం ప్రేమ్ కుమార్ ,రుద్ర శ్రీకాంత్ ,సామకూరి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.