లయన్స్ క్లబ్ సేవలు అబినందనియం.

తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్.
తాండూరు జులై 24(జనంసాక్షి)లయన్స్ క్లబ్ సేవలు అబినందనియమని తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ పేర్కొన్నారు.ఆదివారం తాండూరు పట్టణం సల్ల గార్డెన్ లోలయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ 47వ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ ,లయన్ పి సూర్యనారాయణ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్, లయన్ డాక్టర్ ఉదయ్. పీ.షా రీజియన్ చైర్మన్ లయన్ రమేష్ చంద్ర పండిత్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ , లయన్ బిక్కుమల్ల శ్రీధర్ జోన్ చైర్మన్, నూతన అధ్యక్షులు జహీర్ హైమద్ , కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్, కోశాధికారి మహమ్మద్ యూసుఫ్ నియమించారు.మరియు లయన్ సీనియర్ సభ్యులు సల్ల దామోదర్ , ఓం ప్రకాష్ సోమని , చంద్రశేఖర్ , వరప్రసాద్ ఘనాటి రవీందర్ రెడ్డి , కుంచం మురళీదార్, కటకం వీరేందర్ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ సమాజంలో సేవాకార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ముందుంటారని కోనియాడారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా విజయ విద్యాలయ హై స్కూల్ కు 10 బెంచీలను అందజేశారు.ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ సెక్రటరీ రొంపల్లి సంతోష్ కుమార్ ని ఇంటర్నేషనల్ వైష ఫెడరేషన్ సభ్యులు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమం సందర్భంగా నూతనంగా గాజుల వీరప్రసాద్ , మహమ్మద్ జమీల్ అహ్మద్ లను లైన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ లోకి ఆహ్వానించారు.