లలిత త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గామాత

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 29(జనం సాక్షి)

దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం వరంగల్ ఎస్ ఆర్ ఆర్ తోట కరీమాబాదు నందు గురువారం శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నాల్గవ రోజు జరిగినవి .అర్చకులు పాలకుర్తి ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో . నాల్గవ రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరీ దేవి అలంకారం లో దర్శనం ఇచ్చారు.ఉదయం అమ్మవారికి అభిషేకం, అమ్మవారు సన్నిధిలో ప్రతి రోజు పూజలతో పాటు హోమాలు నిర్వహించ బడినవి దేవాలయ కమిటీ అధ్యక్షులు ,కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.