లారీ ఢీకొని రిపోర్టర్ మృతి

ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. సబ్ ఇన్స్పెక్టర్ రావుల నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన వెలిజాల కృష్ణ(39) దినపత్రిక రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. బైక్ పై వెళ్తుండగా బోయ గూడెం మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని భార్య మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.