లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసిన వారిపై కఠిన చర్యలు

మల్దకల్ సెప్టెంబర్ 23(జనం సాక్షి) మండల కేంద్రంలోని ఎరువులు,పురుగు మందులు విత్తన డీలర్లతో శుక్రవారం రైతు వేదిక భవనంలో మండల వ్యవసాయ అధికారి సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశం లో మండలవ్యవసాయఅధికారి కె. రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క డీలర్ ఎరువులను ఈ  పాస్ మెషిన్ ద్వారా అమ్మాలని,స్టాక్ రిజిస్టర్ లో  స్టాక్ ను ఎప్పటికపుడు పొందుపరచాలని,లైసెన్స్  లేకుండా వ్యాపారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశానికి మండలంలోని ఎరువులు, పురుగు మందులు,విత్తన డీలర్లు పాల్గొన్నారు.
Attachments area