లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లి:  మూడుసార్లు వాయిదా పడిన అనంతరం  తిరగి ప్రారంభమైన లోక్‌సభలో ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా నివాదాలు మార్మోగాయి. ఎఫ్‌డీఐలపై చర్చంచాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభను శుక్రవారానికి వాయిదా పడింది. యూపీఏ విధానలకు వ్యతిరేకంగా విపక్షాలు నినాదాలు చేయడంతో సభ దద్ధరిల్లింది. ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించారు.