లోయలో పడ్డ కారు: ఇద్దరు మృతి

డెహ్రాడూన్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రిషికేష్‌ గంగోత్రి హైవేపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.