వడ్డేపల్లి మండల కిషన్ సెల్ అధ్యక్షుడు నాగరాజు గౌడ్ గుండెపోటుతో మృతి

గద్వాల నడిగడ్డ, జులై 21 (జనం సాక్షి);

జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన వడ్డేపల్లి మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు నాగరాజు గౌడ్ గురువారం రాత్రి గుండెపోటుతో మరణించారు. మరణ వార్త తెలుసుకొని వెళ్లి ఆయన భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన వడ్డేపల్లి మండల అధ్యక్షుడు బంగారు రామకృష్ణారెడ్డి, వడ్డేపల్లి టౌన్ ప్రెసిడెంట్ చిన్ని బాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దండముని నాగ శిరోమణి, వడ్డేపల్లి దేవేందర్, అలంపూర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జోగుల రవి, పుటాన్ దొడ్డి వెంకటేష్, పైపాడు రామ్ రెడ్డి, జయరామ్ రెడ్డి,ఈశ్వర్, నవీన్ ,నరసింహనాయుడు, పరుష తదితరులు ఉన్నారు.