వరంగల్‌లో కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

వరంగల్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ తెలంగాణ జాతిపిత అని కొనియాడారు. పేదల సంక్షేమానికి పాటు పడుతున్న కేసీఆర్‌ను భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. తెలంగాణ సాధించిన యోధుడు కేసీఆర్‌ అని చెప్పారు. ఉద్యమ ప్రస్థానంలో ఆయన త్యాగనిరతి అనన్య సామాన్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు మంగళవారం పరకాలలో నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో సాగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి కేక్‌ కోశారు. అనంతరం ప్రభుత్వ సివిల్‌ ఆస్పత్రి రోగులకు పండ్లు, రొ/-టటెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు కల్పనాదేవి, నగర పంచాయతీ లద్ఘిర్మన్‌ రాజభద్రయ్య, నాయకులు పాల్గొన్నారు.