వరంగల్ జిల్లాలో చెరువులో పడి నలుగురు యువకుల మృతి
మద్దూర్: వరంగల్ జిల్లా మద్దూర్ మండలం గాగిల్లాపూర్ పెద్దచెరువులో పడి నలుగురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. హైదరాబాద్లోని చిక్కడపల్లి, రామాంతపూర్కు చెందిన ఎనగందుల పోచయ్య(42), ప్రవీణ్(17), నర్సింహులు (40), మధు(14) బుధవారం బంధువుల ఇంటికి గాగిల్లాపూర్ వచ్చారు. శుక్రవారం స్నానం చేసేందుకు సమీప పెద్దచెరువుకు వెళ్లారు. ఇద్దరు బాలురు స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు వ్యక్తులు కూడా చెరువులో మునిగి మృతి చెందారు.