వరంగల్‌ రూరల్‌ డీపీఆర్‌వోగా పల్లవి 

– ఉత్తర్వులు జారీ చేసిన అడ్మినిస్టేట్రివ్‌ అధికారి అరవింద్‌కుమార్‌
వరంగల్‌ రూరల్‌, మే9(జ‌నం సాక్షి) : రూరల్‌ జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ (డీపీఆర్‌వో) జిల్లా అధికారిగా బి. పల్లవి నియామకమయ్యారు. ఈమేరకు బుధవారం సమాచారశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (అడ్మినిస్టేట్రివ్‌) అధికారి అరవింద్‌కుమార్‌ ఉత్తర్వులను విడుదల చేశారు. పల్లవి డిప్యూటేషన్‌పై జీడబ్ల్యూఎంసీ పీఆర్‌వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే తనను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని సమాచార శాఖకు చేసుకున్న విజ్ఞప్తి మేరకు ఆమెను రూరల్‌ జిల్లా డీపీఆర్‌వోగా నియామకం చేశారు. రూరల్‌ జిల్లాలో ఎఫ్‌ఏసీ డీపీఆర్‌వోగా విధులు నిర్వహిస్తున్న కిరణ్మయి రూరల్‌ జిల్లా ఏపీఆర్‌వోగా విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో పీఆర్‌వోగా విధులు నిర్వహిస్తున్న పల్లవి రూరల్‌ డీపీఆర్‌వోగా విధుల్లో చేరనున్నారు.