వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ
హైదరాబాద్ : వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన జీవితఖైదీ సురేష్ను రౌడీషీటర్ సాజిద్ చితకబాదారు. జైలు అధికారుల సమక్షంలోనే గొడవ జరిగిందని, తనను చంపేందుకు యత్నించాడని జైలు అధికారులకు సురేష్ ఫిర్యాదు చేశారు. దీన్ని అధికారులు పట్టించుకోలేదు. రెండు రోజుల క్రితం ఘటన జరగ్గా సురేష్కు వైద్యం కూడా అందించలేదని సమాచారం. రౌడీషీటర్ సాజిద్పై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకంజ వేస్తున్నారని తెలిసింది.