వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కొరకు జోరుగా ప్రచారం..

పెద్దవంగర మే 10(జనం సాక్షి )పాలకుర్తి నియోజకవర్గం శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని ఝాన్సీ రెడ్డి ఆదేశాను సారం శుక్రవారం మండలంలో ఉప్పరగూడెం గ్రామం లో పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఉపాధి కూలీల తో పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొన్న మాజీ ఎంపిటిసి వేముల వెంకన్న,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడియం కావ్య ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓట్లను కోరారు.
రైతు భరోసా అరె అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతారని కావున ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో దుంపల శ్యామ్, దుంపలు ఉప్పలయ్య, వేముల ఉప్పలయ్య,ఐలయ్య, మల్లయ్య, రవి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.