వరంగల్ పిన్నవారి స్ట్రీట్ లో వినాయక మండపం వద్ద విశేష పూజలు

వరంగల్ పిన్నవారి స్ట్రీట్ లో వినాయక మండపం వద్ద విశేష పూజలు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 23 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని పిన్న వారి స్ట్రీట్లో గణేష్ ఉత్సవ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద శనివారం భక్తులు విశేష పూజలు నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా మట్టి వినాయకుని ప్రతిష్టిస్తూ పూజలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా ఈ తొమ్మిది రోజులు వివిధ రకాల ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.