వరద బాధితులకు అండగా ఉంటాం: పాయం.

బూర్గంపహాడ్ జూలై 28(జనంసాక్షి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటామని పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం సారపాక లోని సుందరయ్య నగర్ లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాదితుల కష్టాలు తెలుసుకున్న ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు, టిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్దిక సహకారంతో నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని తెలిపారు. గత మూడు రోజుల నుండి మండలంలోని ముంపుకు గురైన ప్రాంతాలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు, అభిమానులు, టిఆర్ఎస్ కార్యకర్తలు నిర్విరామంగా నిత్యావసర సరుకులను బాదిత కుటుంబాల ఇంటికి చేరవేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసీసీబీ డైరెక్టర్ తూళ్లూరు బ్రహ్మయ్య, పిఏసిఎస్ మాజీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరెడ్డి, శంకరెడ్డి, కోమటిరెడ్డి వెకటరెడ్డి , నల్లమోతు సురేష్ తదితరులు పాల్గొన్నారు