వసతి గృహాలను సందర్శించిన ఫుడ్ ఇన్స్పెక్టర్
జూలూరుపాడు, ఆగష్టు 5, జనంసాక్షి:
మండల పరిధిలోని పడమటి నరసాపురం గ్రామంలో ఉన్న పోస్ట్ మెట్రిక్ గిరిజన బాలికల కళాశాల వసతి గృహం, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఫుడ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల కోసం వినియోగించే వివిధ ఆహార సరుకులు, కూరగాయలు, బోరు నీళ్లు, ఆర్ఓ ప్లాంట్ నీళ్లు, సరుకులు భద్రపరిచే గదులను పరిశీలించారు. విద్యార్థులకు అందజేసే భోజన మెనూ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహార పంపిణీ విషయంపై కూడా విచారించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమేష్, వార్డెన్ తారాదేవి, పిఎంహెచ్ హాస్టల్ వార్డెన్ తార తదితరులు పాల్గొన్నారు