వసతి గృహాల్లో నాణ్యమైన భోజనాన్ని అందించాలి

ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి
మిర్యాలగూడ,జనం సాక్షి.
ప్రభుత్వ విద్యార్థి వసతి గృహాల్లో నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను నుంచి విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాలని మిర్యాలగూడ ఎంపీపీ నూగుల సరళ హనుమంత్ రెడ్డి కోరారు. గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో పట్టణంలోని ఎస్సీ, ఎస్ టి, బి సి. వసతి గృహాల వార్డన్ లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వసతి గృహాల నిర్వహణలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నిర్వహించాలని, వసతి గృహాల పరిసరాలు పచ్చదనం పరిశుభ్రతతో ఉండేలా చూసుకోవాలన్నారు. వైద్యాధికారులతో సంప్రదించి క్రమం పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా విద్యార్థులు చదువుకునేందుకు సరైన సౌకర్యాలు కల్పించాలన్నారు. సమీక్ష సమావేశంలో ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి, వసతి గృహ నిర్వాహకులు పాల్గొన్నారు .