వాఘా బార్డర్‌లో స్వీట్ల పంపిణీ

న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): వాఘా బార్డర్‌లో పాకిస్థాన్‌ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాక్‌ ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా ఇరు దేశాల సైనికులు స్వీట్లు ఇచ్చి పుచ్చుకున్నారు. అటారీ-వాఘా బార్డర్‌ గేట్‌ వద్ద స్వీట్లు బాక్స్‌ లు ఇచ్చి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రతి ఏటా ఇక్కడ ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది.