వికలాంగులపై ఉన్మాది దాడి: 19 మంది మృతి

murder-crime-26-1469498755టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నగరం శివారులో ఉన్న సాగమిహరలోని ఓ వికలాంగుల ఆశ్రమంపై ఉన్మాది కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా చేసిన ఈ దాడిలో 19 మంది మరణించగా, 25 మంది దాకా గాయపడ్డారు. గాయపడినవారిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దాడి చేసిన తర్వాత దుండగుడుపోలీసులకు లొంగిపోయాడు. అతన్ని ఆశ్రమం పూర్వ ఉద్యోగిగా గుర్తించారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆ పని తానే చేశానంటూ 26 ఏళ్ల యువకుడు లొంగిపోయాడు.

కత్తి ధరించిన ఓ వ్యక్తి లోనికి వస్తున్నాడని తమకు తెల్లవారు జామును రెండున్నర గంటల సమయంలో ఫోన్ వచ్చిందని పోలీసులు చెప్పారు. వికలాంగులంతా అంతమై పోవాలని అనుమానితుడు అన్నట్లు చెబుతున్నారు. నిందితుడిని సతోషి ఉమాత్సుగా గుర్తించారు.