వికలాంగుల హక్కుల పోరాటం సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి

బోథ్ తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ అతీకొద్దీన్  వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రం అందజేశారు. మండలం లోని దివ్యంగులకు అంత్యోదయ కార్డులను మంజూరు చేయాలనీ మండల ఉపాధ్యక్షులు ఉశ్కెల దశరథ్ డిమాండ్ చేసారు.దీని పై సానుకూలంగా స్పందించిన తహసీల్దార్  ఇట్టి విషయాన్నీ పై అధికారులకు తెలియజేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు షేక్ మహిబూబ్, మండల అధ్యక్షులు M. రాజేశ్వర్, కోశాధికారి D. రమేష్,తదితరులు పాల్గొన్నారు.