*వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిని కలిసిన పెద్దేముల్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు*

జనంసాక్షి జూలై:
వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డిని ఆదివారం పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దేముల్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మర్పల్లి మండలంలో జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి వాహనం పై జరిగిన దాడి నేపథ్యంలో పెద్దముల్ గ్రామ టిఆర్ఎస్ నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశమైన సునీతా రెడ్డి…మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీని పటిష్టపరచడానికి ప్రతి ఒక్క కార్యకర్త గ్రామస్థాయిలో సైనికునిలా పనిచేయాలని,తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటింటికి చేరే విధంగా ప్రచారం నిర్వహించాలని అన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ పరంగా అండగా ఉంటామని, ఎవరు కూడా అధైర్య పడవద్దని, తమ కుటుంబం అండగా ఉంటుందని సూచించారు. ఆమెను కలిసిన వారిలో పెద్దేముల్ సొసైటీ ఛైర్మెన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డివై నర్సింహులు, పార్టీ సీనియర్ నాయకులు కిషన్ రావు, జితేందర్ రెడ్డి,ఎర్ర బాలప్ప, ఇందూరు ప్రకాష్,అజీమ్ విట్టల్,నర్సింలు,వెంకటయ్య,రత్నప్ప,అశోక్ గౌడ్,హాజీబాబా,కిరణ్,అరుణ్,నరేష్,చిన్న, విష్ణు అన్న యువసేన సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area