విగ్రహంలా మారుతున్న 11 ఏళ్ల బాలుడు!

skin _0నేపాల్ : పాపం..ఈ బాలుడిని చూశారా ? ఎలా మారిపోతున్నాడో ? పుట్టిన పదిహేను రోజుల నుండి తరువాత ఈ బాలుడి శరీరం నల్లగా మారిపోతూ వస్తోంది. నాటి నుండి క్రమ క్రమంగా శరీరం విగ్రహంలా మారిపోతోంది. నేపాల్ కు చెందిన నార్ కుమారి, నంద దంపతులకు రమేష్ కొడుకున్నాడు. పుట్టుకతోనే హార్లీక్వీన్ ఇచ్చియోసిస్ అనే చర్మ వ్యాధి వచ్చింది. ముఖంపై నల్లని పొలుసులు ఏర్పడ్డాయి. చర్మం గట్టిగా మారిపోతూ వస్తోంది. దీనితో రమేష్ బయటకు వెళ్లలేక..నలుగురితో మాట్లాడలేకపోతున్నాడు. ప్రస్తుతం పదకొండేళ్లు ఉన్న ఈ బాలుడు ఇంట్లో నాలుగు గోడలకే పరిమితమయ్యాడు. రోజు రోజుకు చర్మం గట్టిగా మారుతుండడం..పొలుసులు ఏర్పడుతుండడంతో వైద్యులను సంప్రదించారు. జన్యుపరమైన లోపం వల్ల చర్మ సంబంధిత వ్యాధి వచ్చిందని..ఫంగల్ ఇన్ ఫెక్షన్ అని వైద్యులు పేర్కొంటున్నారంట. ప్రస్తుతం ఖాట్మండు మెడికల్ కళాశాల వైద్యులు రమేష్ కు శస్త్ర చికిత్స చేస్తున్నారు. బాలుడి శరీరంపై ఉన్న నల్లటి పొలుసులను తీసేస్తున్నారు. బాలుడు కోలుకోవడానికి రెండు వారాల కొకసారి యాంటీ బయోటిక్స్ ఇవ్వడం జరుగుతోందని, నల్లటి చర్మం తొలగించేందుకు మాయిశ్చరైజర్ చేస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. తమ కుమారుడి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు కుములిపోతున్నారంట.