విజయవాడలో విషాదం

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
విజయవాడ,జనవరి3(జ‌నంసాక్షి):  విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రాయవేలూరుకు చెందిన క్యాబ్‌డ్రైవర్‌ ధనశేఖర్‌ భార్య, కుమార్తె, పెదనాన్న రైలు కిందపడి మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.  విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.