*విజయ గణపతి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు*

కోదాడ సెప్టెంబర్ 10 (జనం సాక్షి)
కోదాడ పట్టణంలోని విజయ గణపతి దేవాలయం లో శనివారం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు ఉచ్చరణలో ఆయన గణేష్ విగ్రహం వద్ద ఆలయ పూజారులు నిర్వహించిన మహా పూర్ణాహుతి కార్యక్రమంలో  పాల్గొన్నారు. అనంతరం గణేష్ నిమజ్జననికి గుమ్మడికాయ తో దిష్టి తీసి శోభ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన లడ్డు పాటను 40 వేల ఒక రూపాయికి చలిగంటి లక్ష్మణ్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యే లడ్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అధ్యక్షులు బొలిశెట్టి కృష్ణయ్య కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.