విద్యార్థినిపై బ్లేడుతో దాడి

కాకినాడ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలో శనివారం దారుణ ఘటన  చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతోన్న ఓ విద్యార్థినిపై దుండగులు బ్లేడుతో దాడి చేశారు. స్థానిక సమాచాం మేరకు.. తూర్పుగోదావరి జిల్లాలోని చెయ్యేరులో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని శనివారం  ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లగా, అప్పటికే పథకం ప్రకారం అ అమ్మాయిపై దాడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన ఇద్దరు దుండగులు ఆమెను బైక్‌ పై వెంబడించారు. దగ్గరగా వెళ్లి ఒక్కసారిగా విద్యార్థినిపై బ్లేడుతో దాడి చేసి, పరారయ్యారు. చేతికి తీవ్ర గాయమవ్వడంతో.. బాధితురాలు గట్టిగా కేకలేసింది. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారమే ఈ దాడికి కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.