* *విద్యార్థులకు టై బెల్టు లనుపంపిణీ చేసిన వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు*

 పెద్దేముల్ జూలై 29 (జనం సాక్షి)
ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులకు విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని వైశ్య ఫెడరేషన్ రోంపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. శుక్రవారం పెద్దేముల్ మండలంలోని మంబాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు సౌజన్యంతో 435 మంది పాఠశాల విద్యార్థులకు వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్, స్థానిక గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్, తాండూరు వాసవి క్లబ్ అధ్యక్షులు గుండల గౌరీ శంకర్,పాఠశాల చైర్మన్ శ్రీనివాస్, ప్రజల ప్రధానోపాధ్యాయులు రాములు పాఠశాల విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ…. ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటారనే ఉద్దేశంతో విద్యార్థులకు టైప్ బెల్టులు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చామని అన్నారు. నియోజకవర్గంలోని పలు పాఠశాలలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో వైశ్య ఫెడరేషన్ కోశాధికారి ఆగిరి మహేష్, వాసవి క్లబ్ సభ్యులు కందుకూరి ప్రమోద్ కుమార్,ప్రవీణ్ కుమార్, వీరేశం, వెంకటేష్, పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.
Attachments area